రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని పావుశాతం తగ్గించింది. సోమవారం నాటి తన త్రైమాసిక మధ్యంతర ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 4.75 శాతం నుంచి 4.50 శాతానికి దిగింది. సెప్టెంబర్ 22 నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.