Rebels Of Tupakula Gudem: ఘనంగా 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

  • 40 మంది కొత్త నటులతో 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'
  • ముఖ్యపాత్రల్లో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా
  • జైదీప్ విష్ణు దర్శకత్వంలో చిత్రం
  • సంగీతం అందించిన మణిశర్మ 
Rebels Of Tupakula Gudem movie set to release on February 3

ప్రవీణ్‌ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా, శివరామ్ రెడ్డి తదితర 40 మంది కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న చిత్రం 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'. వారధి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి జైదీప్ విష్ణు దర్శకత్వం వహించారు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు. 

'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. "నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. చిత్రబృందం అంతా నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. ఈ సినిమా జనాలకు నచ్చుతుందని, వారికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్‌లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి" అని అన్నారు. 

సంగీత దర్శకుడు, మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ... "మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

More Telugu News