GO No 1: జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

  • రోడ్ షోలు, సభలపై ఏపీ ప్రభుత్వం నిషేధం
  • జీవోను హైకోర్టులో సవాల్ చేసిన సీపీఐ కార్యదర్శి రామకృష్ణ 
  • ప్రభుత్వ జీవోపై తాత్కాలిక స్టే విధించిన ఏపీ హైకోర్టు
AP Govt approaches Supreme Court on GO No 1

రోడ్లపై సభలు, రోడ్ షోలను నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోను వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ జీవోపై తాత్కాలిక స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

More Telugu News