Supreme Court: అమరావతిపై ఏపీ ప్రభుత్వ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

  • అమరావతే ఏపీకి రాజధాని అంటూ హైకోర్టు తీర్పు
  • స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • 161 మంది ప్రతివాదులకు నోటీసుల జారీ
  • ఈ నెల 31 లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశాలు
Supreme Court issues notice to Amaravathi farmers and political parties

గతంలో అమరావతిలో నిర్మాణాలకు కాలపరిమితిపై హైకోర్టు తీర్పు ఇవ్వగా, దానిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమరావతే ఏపీకి రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఈ నేపథ్యంలో, అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాజధాని రైతులు, పలు రాజకీయ పక్షాలను ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. జనవరి 31వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ మొత్తం 161 మంది ప్రతివాదులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

More Telugu News