D Arvind: నన్ను గెలకొద్దు: మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్ వార్నింగ్

  • మంత్రి ప్రశాంత్ రెడ్డిపై అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు
  • ప్రశాంత్ రెడ్డి ఒక బేవకూఫ్ అని మండిపాటు
  • ఏం తింటున్నావ్? అంటూ ఘాటు వ్యాఖ్యలు
D Arvind fires on Prashant Reddy

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బేవకూఫ్ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ఒక బేవకూఫ్ అని అన్నారు. అరేయ్ నీ పని నీవు చేసుకో, నన్ను గెలకొద్దు అని హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది మోదీ కాదా? అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డీ నీవు ఏం తిటున్నావ్... మీరు నన్ను కొట్టడం కాదు.. మిమ్మల్లే ఎడమ కాలు చెప్పుతో కొట్టాలి అని అన్నారు. మీ కారు సింబల్ పైన చెప్పు సింబల్ పెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దుర్మార్గుడని విమర్శించారు.

More Telugu News