Team India: భారీ టార్గెట్ తో బంగ్లాదేశ్ బెంబేలు... మూడో వన్డేలో గెలుపు దిశగా టీమిండియా

  • ఛట్టో గ్రామ్ లో మూడో వన్డే
  • మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు
  • బంగ్లాదేశ్ టార్గెట్ 410 రన్స్
  • 124 పరుగులకే 5 వికెట్లు డౌన్
Team India on course for victory against Bangladesh

బంగ్లాదేశ్ లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ తడబాటుకు గురైంది. బంగ్లాదేశ్ జట్టు 124 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ 2, సిరాజ్ 1, ఉమ్రాన్ మాలిక్ 1, కుల్దీప్ 1 వికెట్ తీశారు. షకీబల్ హసన్ 43, కెప్టెన్ లిట్టన్ దాస్ 29, యాసిర్ 25 పరుగులు చేశారు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ 26 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మహ్మదుల్లా 20, అఫిఫ్ హుస్సేన్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఆ జట్టు గెలవాలంటే 24 ఓవర్లలో 268 పరుగులు చేయాలి.

More Telugu News