ABN: సీఐడీ విచారణకు హాజరైన ఏబీఎన్ వెంకటకృష్ణ

  • రఘురాజు కేసులో వెంకటకృష్ణను విచారణకు పిలిచిన సీఐడీ
  • రెండు రోజుల పాటు విచారించనున్న సీఐడీ అధికారులు
  • న్యాయవాదితో కలిసి సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వెంకటకృష్ణ
ABN Venkata Krishna attends CID questionning

ఏబీఎన్ చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణతో కలిసి సీఐడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. వీరితో పాటు బీజేపీ నేత మువ్వా సత్యనారాయణ, టీడీపీ నేత రాయపాటి సాయికృష్ణ కూడా ఉన్నారు. ఈ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని వీరికి సీఐడీ అధికారులు సూచించగా... వెంకటకృష్ణ 10.20 గంటలకే అక్కడకు చేరుకున్నారు. వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వీరిని సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు.

More Telugu News