Team India: రేపు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే... ట్రోఫీని ఆవిష్కరించిన ఇరుజట్ల కెప్టెన్లు

  • బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా
  • బంగ్లా జట్టుతో 3 వన్డేలు, 2 టెస్టులు
  • డిసెంబరు 4న ఢాకాలో మొదటి వన్డే
Team India takes on Bangladesh in 1st ODI

బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన రేపటి నుంచి షురూ కానుంది. బంగ్లాదేశ్ జట్టుతో తొలుత మూడు వన్డేలు ఆడనున్న టీమిండియా, అనంతరం రెండు టెస్టుల సిరీస్ లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో రేపు (డిసెంబరు 4) తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో, ఇరుజట్ల కెప్టెన్లు నేడు వన్డే సిరీస్ ట్రోఫీ ఆవిష్కరించారు. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, బంగ్లాదేశ్ కు లిట్టన్ దాస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తొలివన్డేకు ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన వివరాలు...


తొలివన్డే- డిసెంబరు 4 (ఢాకా)
రెండో వన్డే- డిసెంబరు 7 (ఢాకా)
మూడో వన్డే- డిసెంబరు 10 (చట్టోగ్రామ్)

మొదటి టెస్టు- డిసెంబరు 14-18 (చట్టోగ్రామ్)
రెండో టెస్టు- డిసెంబరు 22-26 (ఢాకా)

More Telugu News