KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు: కేటీఆర్

  • గ్రూప్ 4 ద్వారా 9,168 ఉద్యోగాల భర్తీ
  • 141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం జరుగుతుందన్న కేటీఆర్
  • పౌర సమస్యలపై మరింత దృష్టిని సారించే అవకాశం కలుగుతుందని వ్యాఖ్య
KTR thanks KCR for releasing Group 4 jobs notification

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ శాఖలకు చెందిన 9,168 ఉద్యోగాలను గ్రూప్ 4 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని ప్రశంసించారు. గ్రూప్ 4 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం జరుగుతుందని చెప్పారు. దీంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని... కౌన్సిలర్లతో వార్డు అధికారులకు మంచి సమన్వయం నెలకొంటుందని తెలిపారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

More Telugu News