Sathyadev: 'గుర్తుందా శీతాకాలం' లిరికల్ సాంగ్ రిలీజ్!

  • సత్యదేవ్ హీరోగా 'గుర్తుందా శీతాకాలం'
  • కథానాయికలుగా తమన్నా .. మేఘ .. కావ్య 
  • మూడు శీతాకాలాల్లో జరిగే కథ ఇది 
  • డిసెంబర్ 9వ తేదీన సినిమా విడుదల 
Gurthunda Seetakalam movie lyrical song released

సత్యదేవ్ హీరోగా 'గుర్తుందా శీతాకాలం' సినిమా రూపొందింది. భవాని రవి - రామారావు నిర్మించిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. సత్యదేవ్ లైఫ్ లోని మూడు దశలలో .. ముగ్గురు హీరోయిన్స్ తో సాగే కథ ఇది. మూడు కథలు కూడా మూడు శీతాకాలాలలో నడుస్తాయి. 

కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'సుహాసినీ ఆహా .. ఏమున్నావే, శ్రీదేవిని ఓహో .. మించేశావే' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు.

సత్యదేవ్ సరసన నాయికలుగా తమన్నా .. మేఘ ఆకాశ్ .. కావ్య అలరించనుండగా, కీలకమైన పాత్రలో సుహాసిని కనిపించనుంది. డిసెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విభిన్నమైన ఈ ప్రేమకథ యూత్ ను ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి.

More Telugu News