Nara Lokesh: జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తున్నా: నారా లోకేశ్

  • 400 రోజుల పాటు 4 వేల కి.మీ. మేర కొనసాగనున్న పాదయాత్ర
  • మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామంలో లోకేశ్ ప్రకటన
  • మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్న లోకేశ్
Nara Lokesh Pada Yatra to start from Jan 27

జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. 


మంగళగిరి నియోజకర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లోకేశ్ చెప్పారు. పాదయాత్ర నేపథ్యంలో ఏడాది పాటు నియోజకవర్గానికి తాను దూరంగా ఉంటానని తెలిపారు. ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చామని... తనను ఇక్కడ ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ చేసే కుయుక్తులను, వాడే ఆయుధాలను నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు సైనికుల మాదిరి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరి బాధ్యతలను మీ భుజస్కందాలపై పెడుతున్నానని... రాష్ట్రంలో టీడీపీని గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోబోతున్నానని చెప్పారు.  

More Telugu News