Jogi Ramesh: పిక్ పాకెటర్లకు నాయకుడు పవన్ కల్యాణ్: ఏపీ మంత్రి జోగి రమేశ్ విమర్శనాస్త్రాలు

  • పవన్, చంద్రబాబుపై ధ్వజమెత్తిన జోగి రమేశ్
  • పవన్ ప్యాకేజీ సైకో అంటూ వ్యాఖ్యలు
  • చంద్రబాబు వృద్ధ సైకో అని విమర్శలు
Jogi Ramesh slams Pawan Kalyan and Chandrababu

ఏపీ మంత్రి జోగి రమేశ్ విపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ సైకో అని విమర్శించారు. ప్యాకేజీ కల్యాణ్ పిచ్చికుక్కలా మాట్లాడతాడని, చెప్పు తీసుకుని కొడతా అంటాడని తెలిపారు. అర్ధరాత్రి పూట తిరిగేవాళ్లకు, పిక్ పాకెటర్లకు పవన్ నాయకుడు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఓ విజిటర్ లా వస్తాడని, రంకెలు, కేకలతో హంగామా చేసి, తొడలు కొట్టి వెళ్లిపోతాడని అన్నారు. పవన్ ను చూసి ఇక్కడే ఉండే సైకో సేనకు చెందినవారు రౌడీల్లా, గూండాల్లా తిరుగుతుంటారని జోగి రమేశ్ విమర్శించారు.  

అటు, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా మంత్రి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఓ వృద్ధ సైకో అని అభివర్ణించారు. ఏదేదో మాట్లాడుతుంటాడని అన్నారు. వైసీపీ నేతలను బట్టలిప్పి కొట్టిస్తానంటున్నాడని, ఈ వయసులో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

More Telugu News