Cab: కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది దుర్మరణం

  • కిష్త్వార్ జిల్లాలో ఘటన
  • ప్రాణాలు తీసిన అతివేగం
  • అదుపుతప్పి లోయలో పడిపోయిన క్యాబ్
Eight dies in fatal accident in Jammu Kashmir

జమ్మూ కశ్మీర్ లో ఓ క్యాబ్ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్ జిల్లాలో మర్వా ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అతి వేగంగా వెళుతున్న క్యాబ్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు.  పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను లోయ నుంచి వెలికి తీశారు. ప్రమాదానికి గురైన వాహనం ఓ టాటా సుమో. ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యధిక భాగం పర్వతమయం. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News