Ram Charan: శంకర్-రామ్ చరణ్ చిత్రంలో ఓ పాట కోసం రూ.15 కోట్లు!

  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్
  • కియారా అద్వానీ హీరోయిన్
  • నవంబరు 20 నుంచి డిసెంబరు 2 వరకు పాట చిత్రీకరణ
  • న్యూజిలాండ్ లో షెడ్యూల్
Huge budget for a song in Ram Charan new movie

దక్షిణాది హిట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఓ పాట కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారట. దక్షిణాదిలో ఇంత భారీ వ్యయంతో పాటను చిత్రీకరించడం ఇదే ప్రథమం అని తెలుస్తోంది.

ఈ భారీ బడ్జెట్ సాంగ్ ను నవంబరు 20 నుంచి డిసెంబరు 2 వరకు జరిగే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ తరలి వెళ్లనుంది. ఈ సినిమా రామ్ చరణ్ కు 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు నిర్మాతగా 50వ చిత్రం.

More Telugu News