Telangana: టీఆర్ఎస్ సమావేశంలో జగన్ ప్రస్తావన.. వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర అన్న కేసీఆర్

  • జగన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారన్న కేసీఆర్
  • వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని ధ్వజం
ts cm kcr alleges that bjp tries to destabilize ysrcp

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుపై ఈ సమావేశంలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను వివరించే క్రమంలో కేసీఆర్... ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను కూడా ప్రస్తావించారు. 

పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా తన కుమార్తెనే పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వైసీపీని, జగన్ ల ప్రస్తావనను కేసీఆర్ తీసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ సీఎం జగన్ అనుకూలంగానే ఉంటున్నారని కేసీఆర్ అన్నారు. ఓ వైపు తమకు జగన్ అనుకూలంగా ఉన్నా ఆయన నేతృత్వంలోని వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News