Mahesh Babu: ఏడాదిలో ముగ్గురిని కోల్పోయిన మహేశ్ బాబు

  • ఈ ఏడాది జనవరి 8న సోదరుడు రమేశ్‌బాబు మృతి
  • సెప్టెంబరు 28న తల్లి ఇందిరాదేవి కన్నుమూత
  • ఆ విషాదం నుంచి తేరుకోకముందే నేడు తండ్రి మృతి
Actor Maheshbabu lost three of his Family members in this year

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు జీవితంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాదిలో ఆయన ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అందరితో కన్నీళ్లు తెప్పిస్తోంది. జనవరి 8న మహేశ్ బాబు సోదరుడు, నటుడు, నిర్మాత రమేశ్‌బాబు కాలేయ సంబంధ వ్యాధితో మరణించారు. ఈ బాధ నుంచి ఆయన కోలుకోక ముందే ఆయన తల్లి ఇందిరాదేవి సెప్టెంబరు 28న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

ఆ విషాదం నుంచి మహేశ్ కోలుకోకముందే ఇప్పుడు ఆయన తండ్రి కృష్ణ కన్నుమూశారు. మహేశ్ జీవితంలో వరుసగా ఎదురవుతున్న ఈ విషాద ఘటనలు పలువురితో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ కష్టకాలం నుంచి ఆయన త్వరగా బయటపడే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Telugu News