Gayathri Ravi: టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ, ఐటీ సోదాలు

  • నిన్న మంత్రి గంగుల ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు
  • ఈ రోజు గాయత్రి రవి ఆఫీసులో కొనసాగుతున్న తనిఖీలు
  • గ్రానైట్ వ్యాపారంలో అక్రమాల అభియోగాలతో దాడులు
ED and IT raids in TRS MP Gayathri Ravi office

టీఆర్ఎస్ నేతలకు ఈడీ, ఐటీ అధికారులు షాకిస్తున్నారు. నిన్న మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై అధికారులు దాడి చేశారు. ఇంటికి వేసి ఉన్న తాళాలను సైతం పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే దుబాయ్ నుంచి ఆయన హుటాహుటిన కరీంనగర్ కు చేరుకున్నారు. 

మరోవైపు, ఈరోజు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఆఫీసులో అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే కోణంలో దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News