Sri Lanka: ఇంగ్లండ్ పై టాస్ గెలిచిన శ్రీలంక... ఆస్ట్రేలియన్లందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే!

  • సిడ్నీలో కీలక మ్యాచ్
  • ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇంగ్లండ్ కు సెమీస్ బెర్తు
  • ఇంగ్లండ్ ఓడితే ఆసీస్ కు సెమీస్ చాన్స్
Sri Lanka won the toss against England

టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. సిడ్నీలో ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య గ్రూప్-1 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ఇంగ్లండ్ నేరుగా సెమీస్ కు వెళుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ ఓడిపోతే ఆ సెమీస్ బెర్తు ఆస్ట్రేలియాకు దక్కుతుంది. అందుకే, ఇవాళ్టి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోవాలని ఆస్ట్రేలియన్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ చేరింది.

నేటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా, శ్రీలంక జట్టులో మధుషాన్ స్థానంలో కరుణరత్నేని తుదిజట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సాంక 32 పరుగులతోనూ, ధనంజయ డిసిల్వా 2 పరుగులతోనూ ఆడుతున్నారు. 18 పరుగులు చేసిన ఓపెనర్ కుశాల్ మెండిస్... క్రిస్ వోక్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

More Telugu News