Tarun Chugh: టీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా.. గెలుపు బీజేపీదే: తరుణ్ ఛుగ్

  • మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందన్న తరుణ్ ఛుగ్
  • మంత్రులు ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపణ
  • ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా
BJP will win in Munugode says Tarun Chugh

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాన్ని తాము చేయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా అన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంత చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి, పేదల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. దేశానికి ప్రధాని కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే కేసీఆర్ అవినీతిని బయటపెడతామని చెప్పారు.

More Telugu News