Telangana: ఈ సుందర దృశ్యం ఎక్కడిదో చెప్పమన్న కేటీఆర్... వైరల్ గా మారిన మంత్రి ట్వీట్

  • పర్యాటక ప్రాంతం ఫొటోను పోస్ట్ చేసిన కేటీఆర్
  • క్షణాలలో వచ్చిన వందల కొలదీ రీట్వీట్లు 
  • అది గండిపేట లేక్ పార్క్ లోనిదన్న నెటిజన్లు
ktr post on a tourism in hyderabad goes viral on socialmedia

ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న తరుణాన... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఓ సుందర దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఆయన... ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు. ఈ ట్వీట్ కు క్షణాల్లోనే వందల కొలదీ రీ ట్వీట్లు వచ్చి పడ్దాయి. కొందరు ఆ సుందర దృశ్యం ఇటీవలే ప్రారంభమైన గండిపేట లేక్ పార్క్ లోనిదంటూ సమాధానం ఇచ్చారు.

More Telugu News