Sehar Shinwari: టీమిండియాను ఓడిస్తే జింబాబ్వే దేశస్తుడ్ని పెళ్లాడతా...  పాకిస్థాన్ నటి ఆసక్తికర ట్వీట్

  • టీ20 వరల్డ్ కప్ లో పాక్ సెమీస్ చాన్సులు సంక్లిష్టం
  • ఆదివారం భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్
  • జింబాబ్వే గెలిస్తే పాక్ ఆశలు సజీవం
  • ట్విట్టర్ లో స్పందించిన పాక్ నటి సెహర్ షిన్వారీ
Pakistan actress Sehar Shinwari teasing tweet

టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, సెహర్ షిన్వారీ స్పందిస్తూ... టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే, తాను జింబాబ్వే దేశస్తుడ్ని పెళ్లాడతానని ప్రకటించారు. 

నిన్న టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియానే నెగ్గింది. దాంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలోనే సెహర్ షిన్వారీ పైవిధంగా స్పందించారు. 

ఇక తాను ఆడబోయే మిగతా మ్యాచ్ లు అన్నింట్లో పాక్ గెలవాల్సి ఉండగా, అదే సమయంలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఆ విధంగా జరిగితేనే పాక్ కు సెమీస్ బెర్తు లభించే అవకాశం ఉంటుంది.

More Telugu News