Andhra Pradesh: టీడీపీ నేత కుమార్తె కిడ్నీ ఆపరేషన్ కు సేకరించిన రూ.15 లక్షలు అందించిన నారా లోకేశ్

  • కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన టీడీపీ కార్యకర్త కుమార్తెకు కిడ్నీ సంబంధిత వ్యాధి
  • ఆపరేషన్ కు రూ.15 లక్షలు అవసరమన్న వైద్యులు
  • విషయం తెలిసి నిధుల సేకరణ ప్రారంభించిన కోమటి జయరామ్
  • టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో రూ.15 లక్షల సేకరణ
  • నారా లోకేశ్ ద్వారా నిధులను బాధిత కుటుంబానికి అందించిన ఎన్నారై విభాగం
nara lokesh handed over 15 lack rupees cheque to tdp leaders daughter operation

కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమార్తెకు ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ అందజేశారు. ఈ మేరకు శుక్రవారం రూ.15 లక్షల చెక్కును బాలిక తండ్రి గాజుల మురళీకృష్ణకు ఆయన అందజేశారు. ఈ మొత్తాన్ని టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం సేకరించింది. ఆ మొత్తాన్నే నారా లోకేశ్ బాధిత కుటుంబానికి అందజేశారు. 

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేత మురళీకృష్ణ కుమార్తె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యులకు చూపించగా...బాలికకు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన కీలక నేత కోమటి జయరామ్ నిధుల సేకరణకు పూనుకున్నారు. టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో బాలిక ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆయన సేకరించారు. ఈ నిధులను నారా లోకేశ్ ద్వారా టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం బాధిత బాలికకు అందజేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం ముందుంటుందని లోకేశ్ అభినందించారు.

More Telugu News