Pakistan: జింబాబ్వేను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన పాక్

  • టీ20 వరల్డ్ కప్ లో పాక్, జింబాబ్వే మ్యాచ్
  • పెర్త్ వేదికగా పోరు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 రన్స్
Pakistan restricts Zimbabwe for low score

టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వేతో మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పెర్త్ లో జింబాబ్వేను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. 

ఈ మ్యాచ్ లో జింబాబ్వే  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

జింబాబ్వే ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ మహమద్ వాసిమ్ జూనియర్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశాడు. పాక్ కొత్త బంతి బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షా ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయారు.

More Telugu News