YSR Insurance: వైఎస్ఆర్ బీమా పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్ట్

  • కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలే టార్గెట్
  • బీమా వస్తుందంటూ మోసాలు
  • ఏడాది కాలంగా ఢిల్లీ కేంద్రంగా మోసాలు
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Police arrests fraudsters who cheated people pretext of YSR Insurance

వైఎస్ఆర్ బీమా పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు బీమా పరిహారం వస్తుందంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. 

ఈ ముఠా గత ఏడాదిగా ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న విషయం వెల్లడైంది. ఈ ముఠాలో నేపాల్ కు చెందిన వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా నలుగురిని అరెస్ట్ చేశారు. 

నిందితుల నుంచి రూ.3.29 లక్షల నగదుతో పాటు 73 ఏటీఎం కార్డులు, 18 మొబైల్ ఫోన్లు, 290 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News