AP High Court: జర్నలిస్టు అంకబాబుపై తదుపరి చర్యలు వద్దు... ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

  • సోషల్ మీడియా పోస్టును ఫార్వార్డ్ చేశారంటూ అంకబాబుపై సీఐడీ కేసు
  • హైకోర్టులో బెయిల్ పొందిన సీనియర్ జర్నలిస్టు
  • తనపై కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేసిన అంకబాబు
  • తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా 
ap high court orders ap cid to not to take any further actions on joirnalist ankababu

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్టు అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన అంకబాబు...తాజాగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా కేసును కొట్టివేసే అంశంపై నిర్ణయాన్ని ప్రకటించని హైకోర్టు.. అంకబాబుపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల (నవంబర్) 8 కి వాయిదా వేసింది.

More Telugu News