Boy: పరీక్ష చిట్టీ విసిరితే లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి... బాలుడ్ని నరికి చంపిన అమ్మాయి సోదరులు

  • బీహార్ లో ఘోరం
  • సోదరిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చిన బాలుడు
  • ఆమె కోసం చిట్టీ విసిరిన వైనం
  • మరో అమ్మాయి వద్ద పడిన చిట్టీ
  • సోదరులకు సమాచారం అందించిన అమ్మాయి
Girl kin killed boy mistakenly

పరీక్షలకు సరిగా చదవని వారు ఎలాగైనా పాసై పోవాలన్న ఉద్దేశంతో పరీక్ష కేంద్రంలోకి చిట్టీలు తీసుకువస్తుంటారు. ఇలాంటి ఓ చిట్టీ బాలుడి ప్రాణాలను బలిగొంది. ఎగ్జామ్ చిట్టీని లవ్ లెటర్ గా భావించి ఓ అమ్మాయి తన సోదరులకు సమాచారం అందించగా, ఆ చిట్టీ విసిరిన బాలుడ్ని వారు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో జరిగింది. 

ఉద్వంత్ నగర్ కు చెందిన దయాకుమార్ (12) తన సోదరిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చాడు. సోదరికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో, ఆమె పరీక్ష రాస్తుండగా ఓ చిట్టీని ఎగ్జామ్ హాల్లోకి విసిరాడు. అయితే ఆ చిట్టీ మరో అమ్మాయి వద్ద పడింది. 

అయితే ఆ అమ్మాయి దాన్ని ప్రేమలేఖగా పొరబడింది. దీనిపై తన అన్నలకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని దయాకుమార్ ను చితకబాది, ఆపై కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ బాలుడి శరీర భాగాలు లభ్యం కావడంతో అతడు హత్యకు గురైనట్టు వెల్లడైంది. 

ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ హత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరు బాలురు కూడా ఉన్నారు.

More Telugu News