BJP: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు దీపావ‌ళి బొనాంజా

  • ఇటీవ‌లే ఉద్యోగుల‌కు 4 శాతం డీఏ పెంచిన కేంద్రం
  • తాజాగా మ‌రో 15 శాతాన్ని పెంచుతూ నిర్ణ‌యం
  • పెంచిన డీఏను జులై నెల నుంచే అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
union government hikes 15 percent da for employees

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు దీపావ‌ళికి ముందే పండుగ వ‌చ్చేసింది. ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం దీపావ‌ళి కానుక‌గా 15 శాతం డీఏను పెంచింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజా డీఏ పెంపును జులై నెల నుంచే అమ‌లు చేయ‌నున్న‌ట్లుగా కూడా కేంద్రం ప్ర‌క‌టించింది.

ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 4 శాతం డీఏ పెంచుతూ ఎన్డీఏ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం తీసుకున్న రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోమారు డ‌బుల్ డిజిట్‌తో కూడిన డీఏ పెంపును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News