Munugode: ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటిలో భోజ‌నం చేసిన కేటీఆర్‌

  • చండూరులో నామినేష‌న్ వేసిన ప్ర‌భాక‌ర్‌రెడ్డి
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేటీఆర్‌
  • అనంత‌రం శివ‌న్న‌గూడెంలో అంశాల స్వామి ఇంటికెళ్లిన వైనం
  • మ‌రో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి భోజ‌నం చేసిన కేటీఆర్‌
ts minister takes lunch at floride affected persons house

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు గురువారం చండూరు వెళ్లిన ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌... నామినేష‌న్ అనంత‌రం నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని శివ‌న్న గూడెం వెళ్లారు. గూడెంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌... ఆయ‌న యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా అంశాల స్వామి ఇంటిలోనే కేటీఆర్ మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. నేల‌పై చాప ప‌ర‌చ‌గా దానిపై మ‌రో మంత్రి జ‌గదీశ్ రెడ్డితో క‌లిసి కూర్చున్న కేటీఆర్...అంశాల స్వామితో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ సందర్భంగా త‌న ప‌క్క‌నే కూర్చున్న అంశాల స్వామికి భోజ‌నాన్ని వడ్డించారు.

More Telugu News