Janasena: ఈ నెల 15 నుంచి ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌... 16న విశాఖలో జ‌న‌వాణి

  • ఈ నెల 15,16, 17 తేదీల్లో ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌
  • విశాఖ జ‌న‌వాణిలో ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించ‌నున్న వైనం
  • ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన నేత‌ల‌తో కీల‌క స‌మావేశం
janasena chief pawankalyan tours north andhra from 15th of this month

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉత్తరాంధ్ర‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 15న ఉత్త‌రాంధ్ర చేర‌నున్న ప‌వ‌న్... మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్క‌డే ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌సేన జ‌న‌వాణిని ఆయ‌న నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు స్వీక‌రించ‌నున్నారు. అనంత‌రం ఉత్త‌రాంధ్ర‌కు చెందిన పార్టీ ముఖ్య నేత‌ల‌తో ఆయ‌న భేటీ కానున్నారు.

More Telugu News