Rossouw: రూసో మెరుపు సెంచరీ... టీమిండియా టార్గెట్ 228 రన్స్

  • ఇండోర్ లో మ్యాచ్
  • టాస్ గెలిచిన టీమిండియా
  • దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్
  • టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన రూసో
Rossouw lighting hundred drives SA for a mammoth score

ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సఫారీలు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటింగ్ తీరే అందుకు నిదర్శనం. 

రిలే రూసో మెరుపు సెంచరీ సాయంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. రూసో కేవలం 48 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. మైదానం చిన్నది కావడంతో పరుగులు వెల్లువెత్తాయి. 

ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా (3) ఆరంభంలోనే వెనుదిరిగినా, రూసో, డికాక్ జోడీ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ట్రిస్టాన్ స్టబ్స్ 23, డేవిడ్ మిల్లర్ 5 బంతుల్లో 19 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చహర్ 1, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

More Telugu News