Team India: నేడు చివరి టీ20... దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన టీమిండియా

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్
  • 2-0తో గెలిచిన టీమిండియా
  • నేడు నామమాత్రపు మ్యాచ్
  • టీమిండియాలోకి శ్రేయాస్, సిరాజ్, ఉమేశ్
Team India won the toss in the third T20

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచినందున, ఈ మ్యాచ్ కు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

టీమిండియా తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లకు స్థానం కల్పించారు. వీపునొప్పితో అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టులో ఆన్రిచ్ నోర్జే స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ కు స్థానం కల్పించారు.

More Telugu News