Allu Arjun: 'పుష్ప 2' కోసం రంగంలోకి బాలీవుడ్ హీరో!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • 350 కోట్లతో 'పుష్ప 2' నిర్మాణం 
  • గట్టిగానే కసరత్తు చేస్తున్న సుకుమార్ 
  • పెరుగుతున్న స్టార్స్ సంఖ్య
Pushpa 2 movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన  'పుష్ప' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా 'పుష్ప 2' పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో .. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వివిధ భాషలకి చెందిన మరికొంతమంది ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. అక్కడి నుంచే ఇప్పుడు మరో హీరోను కూడా తీసుకోనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం అర్జున్ కపూర్ ను ఎంపిక చేయనున్నారని అంటున్నారు. ఆ దిశగా చర్చలు జరిగినట్టుగా చెబుతున్నారు.

ఇక రష్మికతో పాటు మరో కథానాయికకి కూడా చోటు కల్పిస్తున్నట్టు సమాచారం. ఐటమ్ సాంగ్ లో కాజల్ మెరవనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమాకి తగిన స్థాయిలోనే కథలో అన్ని అంశాలను సర్దుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే  ఆలోచనలో ఉన్నారు.   

More Telugu News