Swachh Survekshan Awards: ప‌రిశుభ్ర న‌గ‌రాల జాబితాలో ఐదో స్థానానికి ప‌డిపోయిన విజ‌య‌వాడ‌

  • గ‌తేడాది మూడో స్థానంలో ఉన్న విజ‌య‌వాడ‌
  • రెండు స్థానాలు దిగ‌జారి 5వ స్థానానికి ప‌డిపోయిన వైనం
  • టాప్ 10 న‌గ‌రాల్లో విజ‌య‌వాడ‌తో పాటు విశాఖ‌, తిరుప‌తి
vijayawada felldown to5th rank from 3rd rank inSwachh Survekshan Awards

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుల్లో ఏపీకి మిశ్ర‌మ ఫ‌లితాలు ద‌క్కాయి. దేశంలోనే అత్యంత ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రాల జాబితాలో గ‌తేడాది 3వ స్థానంలో ఉన్న విజ‌య‌వాడ ఈ ఏడాది రెండు స్థానాలు దిగ‌జారి 5వ స్థానంలో నిలిచింది. ఇక దేశంలోని ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రాల జాబితాలో టాప్ 10 న‌గ‌రాల్లో ఏపీకి చెందిన 3 న‌గ‌రాల‌కు చోటు ద‌క్కింది. ఈ జాబితాలో విజ‌యవాడ ఐదో స్థానంలో ఉండ‌గా... విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాలు వ‌రుస‌గా 4, 7వ స్థానాల్లో నిలిచాయి. 

ఇక ఈ జాబితాలో గ‌డ‌చిన ఐదేళ్లుగా తొలి స్థానంలో నిలుస్తూ వ‌స్తున్న ఇండోర్‌... ఈ ఏడాది కూడా త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌‌రుచుకుని వ‌రుస‌గా ఆరేళ్ల పాటు ఈ అవార్డును ద‌క్కించుకుని రికార్డుల‌కు ఎక్కింది. ఇండోర్ త‌ర్వాత సూర‌త్‌, న‌వీ ముంబై వ‌రుస‌గా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఇక ప‌రిశుభ్ర‌మైన రాష్ట్రాల జాబితాలో మ‌ధ్య ప్ర‌దేశ్ టాప్‌లో నిల‌వ‌గా.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్ర త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి.

More Telugu News