Krishna: ఇందిరాదేవి మరణం పట్ల సంతాపం ప్రకటించిన చంద్రబాబు, చిరంజీవి

  • తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి
  • మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్న చంద్రబాబు
  • మృతి చెందారనే వార్త కలచివేస్తోందన్న చిరంజీవి
Chandrababu and Chiranjeevi pays condolences to Krishna and Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఇటీవలే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా ఇందిరాదేవి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు
సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబసభ్యులకు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని... ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని... సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

More Telugu News