Andhra Pradesh: పోర్టుల నిర్మాణంలో అత్యుత్త‌మ రాష్ట్రంగా ఏపీ... టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు కైవ‌సం

  • పోర్టు ఆధారిత మౌలిక వ‌సతుల అభివృద్ధిలో అవార్డును ప్ర‌క‌టించిన టైమ్స్ ఆఫ్ ఇండియా
  • దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • అవార్డును అందుకున్న మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌
ap bags times of india award

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏటా స‌త్తా చాటుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌... తాజాగా పోర్టుల నిర్మాణంలోనూ దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా నిలిచింది. ఈ మేర‌కు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన అవార్డును ఏపీ కైవ‌సం చేసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్య‌లో పోర్టుల‌ను నిర్మిస్తున్న కార‌ణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వ‌స‌తుల అభివృద్ధిలో దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచిన ఏపీని టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా మంగ‌ళ‌వారం ఢిల్లీలో ఈ అవార్డును ప్ర‌దానం చేసింది. ఏపీ త‌ర‌ఫున రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్, ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి క‌రికాల వ‌ల‌వ‌న్‌, మారిటైం డిప్యూటీ సీఈఓ ర‌వీంద్ర నాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.

More Telugu News