Team India: రేప‌టి నుంచే ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ప్రారంభం

  • రేపు తిరువ‌నంత‌పురంలో మొద‌లుకానున్న టీ20 సిరీస్‌
  • అక్టోబ‌ర్ 4న ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్న మూడో టీ20తో ముగియ‌నున్న సిరీస్‌
  • ఇప్ప‌టికే తిరువ‌నంత‌పురం చేరుకున్న ఇరు జ‌ట్ల ఆటగాళ్లు
team india t20 series with south africa starts fromtomorrow

వ‌రుస సిరీస్‌ల‌లో విజ‌యంతో దూకుడు మీద ఉన్న భార‌త క్రికెట్ జ‌ట్టు... రేప‌టి నుంచి ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడ‌నుంది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో రేపు ఈ సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు దేశాల జ‌ట్లు తిరువ‌నంత‌పురం చేరుకున్నాయి. రేపు తిరువ‌నంత‌పురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియంలో రాత్రి 7 గంట‌ల‌కు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబ‌ర్ 2న గువాహటిలో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత సిరీస్‌లో చివ‌రి టీ20 మ్యాచ్ ఇండోర్‌లో అక్టోబ‌ర్ 4న‌ జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌లే ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో విక్టరీ సాధించిన టీమిండియా జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో సిరీస్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌ను పుర‌స్కరించుకుని తిరువ‌నంత‌పురం స్టేడియం వ‌ద్ద టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు చెందిన భారీ క‌టౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.

More Telugu News