Nagarjuna: నేను, అఖిల్ కలిసి ఒక సినిమా చేయబోతున్నాం .. అదెలా ఉంటుందంటే..!: నాగార్జున

  • కర్నూలులో జరిగిన 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వేదికపై చైతూ .. అఖిల్ తో సందడి చేసిన నాగ్
  • 'శివ' రిలీజైన రోజునే 'ఘోస్ట్' వస్తుందంటూ వెల్లడి
  • 'గాడ్ ఫాదర్' ను కూడా ఆదరించాలంటూ వ్యాఖ్య  
The Ghost movie  Pre Release Event

రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున, ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అలా ఆయన చేసిన 'ది ఘోస్ట్' సినిమా, వచ్చేనెల 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో నాగార్జున మాట్లాడుతూ .. " ఇక్కడ ఇంతమందిని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ వేదికపై నేను .. చైతూ .. అఖిల్ ఇంతటి ప్రేమను అందుకుంటున్నందుకుగాను ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి తెలుగు సినిమా పరిశ్రమ అయితే రెండవది మా నాన్నగారు.

33 ఏళ్ల క్రితం 'శివ' అనే సినిమా మీ ముందుకు వచ్చింది .. అప్పుడు 'చైన్' పట్టుకుని వచ్చాను. అదే అక్టోబర్ 5వ తేదీన ఈ సారి ఒక 'కత్తి' పట్టుకుని వస్తున్నాను. విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుందని అంటారు. ఈ పండగ 'ది ఘోస్ట్' సినిమాకి విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాలో నాతో చాలా కొత్తగా చేయించాడు.

ఈ కేరింతలు చూడటానికే చైతూను .. అఖిల్ ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. నేను చేసిన 'బంగార్రాజు' కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టీవీల్లో ఆ సినిమాకి వచ్చిన టీఆర్పీలు ఈ ఏడాదిలో ఇంతవరకూ ఏ సినిమాకీ రాలేదు. నెక్స్ట్ అఖిల్ తో చేయబోతున్నాను.  'ఏజెంట్' .. 'ఘోస్ట్' కలిస్తే ఎలా ఉంటుందో .. ఆ సినిమా అలా ఉంటుంది. విజయదశమి రోజున 'ఘోస్ట్'తో పాటు నాకు ఎంతో ఆత్మీయుడైన చిరంజీవిగారి 'గాడ్ ఫాదర్' రాబోతోంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు.

More Telugu News