Prabhas: ప్రభాస్ ను ఆకట్టుకున్న అభిమానుల వీడియో

  • ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కన్నుమూత
  • అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ప్రభాస్
  • తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
  • అభిమానులు రూపొందించిన వీడియో షేర్ చేసిన వైనం
Prabhas shares a video which edited by fans

తన పెదనాన్న కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. అభిమానులు రూపొందించిన ఓ వీడియోను ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఎమోజీలతో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఆ వీడియోలో కృష్ణంరాజు, ప్రభాస్ ల చిత్రాల్లోని క్లిప్పింగ్స్ ను పక్కపక్కనే చూపించారు. నవరసాలు పలికించడంలో పెదనాన్న కృష్ణంరాజుకు ప్రభాస్ ఏమాత్రం తీసిపోడన్న రీతిలో ఆ వీడియోను రూపొందించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ విశేషంగా స్పందిస్తున్నారు.


More Telugu News