Sajjala Ramakrishna Reddy: వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారు: సజ్జల స్పష్టీకరణ

  • వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్
  • శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరన్న ఎన్నికల సంఘం
  • జగన్ ఐదేళ్ల వరకే అధ్యక్షుడిగా ఉంటారన్న సజ్జల
Jagan rejected the resolution of permanent president post says Sajjala Ramakrishna Reddy

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది. 

ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారని చెప్పారు. జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని... ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని అన్నారు. 

More Telugu News