V Srinivas Goud: టీమిండియా-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ కు టికెట్ల అమ్మకంపై హెచ్ సీఏ అన్ని వివరాలు చెప్పాలి: తెలంగాణ క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

  • ఈ నెల 25న మ్యాచ్
  • వేదికగా ఉప్పల్ స్టేడియం
  • బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్న మంత్రి
Telangana sports minister Srinivas Goud responds on third T20 match

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ నెల 25న మ్యాచ్ జరగనుంది. అయితే, టికెట్ల అంశంపై తెలంగాణ క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకంపై అన్ని వివరాలు చెప్పాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)కు స్పష్టం చేశారు. టికెట్లు బ్లాక్ లో అమ్మినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం స్టేడియం కోసం భూమి కేటాయించింది ఏ పది మందో ఎంజాయ్ చేయడానికి కాదని అన్నారు. మ్యాచ్ టికెట్ల అంశంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

More Telugu News