Team India: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీ

  • త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్
  • కొత్త జెర్సీల్లో కనువిందు చేయనున్న భారత ఆటగాళ్లు
  • పురుషులు, మహిళల జట్ల కోసం ఒకే జెర్సీ
New jersey for Team India in T20 World Cup

ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించనున్నారు. ఈ నూతన జెర్సీలను బీసీసీఐ నేడు ఆవిష్కరించింది. అంతేకాదు, ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. 

ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసియా కప్ లో భారత ఆటగాళ్లు ధరించిన జెర్సీలకు దగ్గరగా ఉంది. ఇది టీ20 జెర్సీ అని బీసీసీఐ వెల్లడించింది. భారత మహిళల జట్టుకు కూడా ఇదే అధికారిక జెర్సీ అని తెలుస్తోంది. 

'వన్ బ్లూ జెర్సీ' పేరిట బీసీసీఐ పంచుకున్న ఫొటోలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలతో పాటు మహిళా జట్టు సారథి హర్మన్ ప్రీత్, షెఫాలీ తదితరులు కూడా ఉన్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనుంది.

More Telugu News