Hyderabad Liberation Day: ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు.. జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు
  • ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా
  • కార్యక్రమానికి హాజరైన ఏక్ నాథ్ షిండే
Amit Shah hoists flag in Hyderabad Liberation Day celebrations

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అంతకు ముందు ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. సైనికుల వందనాన్ని స్వీకరించారు. మరోవైపు, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కర్ణాటక ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు హాజరయ్యారు. 

More Telugu News