Andhra Pradesh: 3 రాజ‌ధానుల రెఫ‌రెండ‌మ్‌గా అసెంబ్లీని ర‌ద్దు చేయాలి: టీడీపీ

  • 3 ముక్కల రాజ‌ధానిపై న‌మ్మ‌కం ఉంటే జ‌గ‌న్ అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌న్న టీడీపీ
  • ఇదే డిమాండ్‌ను అసెంబ్లీ స‌మావేశాల్లో వినిపించ‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • 3 రాజ‌ధానుల‌పై వైసీపీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల‌ను గుర్తు చేసిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం
tdp demands ys jagan to dissolve the assembly

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న వేళ‌... ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ బుధ‌వారం ఓ కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 3 రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌తోనే వెళ‌తామ‌ని వైసీపీకి చెందిన కొంద‌రు కీల‌క నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన అంశాన్ని గుర్తు చేసిన టీడీపీ... 3 రాజ‌ధానుల రెఫ‌రెండ‌మ్‌గా అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసింది. 3 ముక్క‌ల రాజ‌ధానిపై జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఉంటే త‌క్ష‌ణ‌మే అసెంబ్లీని ర‌ద్దు చేయాలని టీడీపీ కోరింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న‌ అసెంబ్లీ సమావేశాల్లో ఇదే డిమాండ్‌ను వినిపించ‌నున్నామ‌ని ఆ పార్టీ తెలిపింది.

More Telugu News