Geetha Sakshiga: ఆసక్తి కలిగిస్తున్న 'గీత సాక్షిగా' ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్

  • చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై చిత్రం
  • ఆదర్శ్, చిత్రా శుక్లా తదితరులు నటించిన చిత్రం
  • ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం
  • గోపీ సుందర్ సంగీతం
First and second look posters from Geetha Sakshiga

ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించిన సబ్జెక్ట్ ఓరియెంటెడ్ చిత్రం 'గీత సాక్షిగా'. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుండగా, తాజా పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తుండడం అదనపు ఆకర్షణ. 

ఈ చిత్రంలో  భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిత్ర నిర్మాత చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందించడం విశేషం. కాగా, పోస్టర్ పై 'నిజ జీవిత సంఘటనల ఆధారంగా'  అనే క్యాప్షన్‌ ఉండడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

More Telugu News