Chandrababu: ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించుకున్న వైసీపీ నేత.. చంద్రబాబు స్పందన

  • నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించుకున్న ఘనుడు
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • ఇదిగో వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు అంటూ చంద్రబాబు ఎద్దేవా
Chandrababu reaction on YSRCP leader grabbing govt school

నంద్యాల జిల్లా పాణ్యంలో మూతపడిన ఓ ప్రభుత్వ పాఠశాలను స్థానిక వైసీపీ నేత ఒకరు ఆక్రమించుకుని, దాన్ని నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదిగిదిగో.. వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News