Puri Jagannadh: 'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్

  • 'లైగర్' కోసం ముంబైకి మకాం మార్చిన పూరీ జగన్నాథ్
  • నెలకు రూ. 10 లక్షల అద్దె
  • పూరీకి నష్టాలను మిగిల్చిన 'లైగర్'
Puri Jagannadh shifting from Mumbai to Hyderabad

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ విజయ్ దేవరకొండ స్పీడ్ కు బ్రేక్ వేయగా... దర్శకుడు పూరీ జగన్నాథ్ కు పీడకలను మిగిల్చింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ తో కలిసి పూరీ జగన్నాథ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. ఈ సినిమా కోసం ఆయన తన మకాంను ముంబైకి మార్చేశారు. నెలకు రూ. 10 లక్షల అద్దెకు అక్కడ ఓ పెద్ద మ్యాన్షన్ ని అద్దెకి తీసుకున్నాడు. ఈ సినిమాను మూడేళ్ల పాటు నిర్మించారు. 

ప్రమోషన్స్ సమయంలో కూడా ఈ సినిమాకు పెద్ద హైప్ క్రియేట్ అయింది. కానీ తీరా విడుదలయ్యాక అంచనాలను అందుకోలేక చతికిల పడింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో ఆ భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతోనే 'జనగణ మన' తీయాలని పూరీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

More Telugu News