Dhanush: 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ధనుశ్!

  • ధనుశ్ హీరోగా వచ్చిన 'తిరు'
  • కథానాయికగా నిత్యామీనన్ 
  • టాలీవుడ్లో అంతగా లేని పబ్లిసిటీ
  • కోలీవుడ్లో జోరు చూపుతున్న సినిమా  
Thiru Movie Update

ధనుశ్ కి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కొత్తదనంతో కూడిన కథలతో .. పాత్రలతో తనదైన ప్రత్యేకతను చాటుతూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆ వైవిధ్యం కారణంగానే ఆయన అక్కడ మిగతా స్టార్స్ నుంచి పోటీని తట్టుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'తిరుచిత్రామ్బలం' రూపొందింది. 

ఆగస్టు 18వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. తెలుగులో ఈ సినిమా 'తిరు' అనే పేరుతో విడుదలైంది. అయితే తెలుగులో సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, పెద్దగా పట్టించుకోలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్ .. నిత్యామీనన్ వంటి పాత్రలకు కూడా వేరేవారు డబ్బింగ్ చెప్పడం మైనస్ అయిందనే టాక్ వచ్చింది. 

తమిళంలో మాత్రం ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 3వ వారంలోకి అడుగు పెట్టకుండానే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేయడం విశేషం. గతంలో ధనుశ్ చాలా హిట్లు కొట్టినప్పటికీ, ఆయనను 100 కోట్ల క్లబ్ లోకి చేర్చిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సారి పెద్దగా హడావిడి చేయకుండానే ధనుశ్ పెద్ద హిట్ కొట్టేశాడనేది హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News