Team India: భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్‌... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక‌

  • టీమిండియాను ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించిన శ్రీలంక‌
  • బిష్ణోయ్ స్థానంలో జ‌ట్టులో చేరిన అశ్విన్‌
  • దుబాయి వేదిక‌గా మ‌రికాసేప‌ట్లో మ్యాచ్‌
srilanka wins the toss and elected to bowl first

ఆసియా క‌ప్‌లో నిల‌వాలంటే గెల‌వాల్సిన మ్యాచ్‌ను టీమిండియా మ‌రికాసేప‌ట్లో శ్రీలంక జ‌ట్టుతో ఆడ‌నుంది. దుబాయి ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. టీమిండియాను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇప్ప‌టికే 3 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా... ఆదివారం జ‌రిగిన హైటెన్ష‌న్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. టైటిల్ రేసులో నిల‌వాలంటే శ్రీలంక‌తో జ‌రుగుతున్న నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి తీరాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ర‌వి బిష్ణోయ్ స్థానంలో సీనియ‌ర్ బౌల‌ర్ ర‌విచంద్రన్ అశ్విన్‌ జ‌ట్టులోకి చేరాడు.

More Telugu News