Crime News: ఉరి వేసుకున్న కొడుకును చూసి తట్టుకోలేక బావిలో దూకేసిన తల్లి

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉరి వేసుకున్న 26 ఏళ్ల యువకుడు
  • ఇది చూసిన బాధతో వెంటనే బావిలో దూకి చనిపోయిన తల్లి
  • ఇద్దరికీ కలిపి అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులు
youth kills himself mother ends life on seeing his body

అతడి పేరు శైలేష్ పాటిల్. వయసు 26 ఏళ్లు.. ఏదో కారణంతో ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అది చూసిన తల్లి కల్పనా పాటిల్ (40 ఏళ్లు) కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది. కొడుకును తలచుకుంటూనే వెళ్లి సమీపంలోని బావిలో దూకి ప్రాణాలు వదిలేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా కంద్రే భురే గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తల్లీకొడుకులకు కలిపి అంత్యక్రియలు నిర్వహించారు.

శైలేష్ ఎందుకు ఉరి వేసుకున్నాడన్నది తెలియరాలేదని.. అసలు ఈ ఘటన గురించి ఫిర్యాదు ఏదీ రాలేదని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఘటనపై విచారణ చేపట్టామని ప్రకటించారు.

More Telugu News