Pawan Kalyan: క‌ర్నూలులో శ్రీరామ టాకీస్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల దాడి... కార‌ణ‌మిదేన‌ట‌!

  • ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జ‌ల్సా సినిమా విడుద‌ల‌
  • శ్రీరామ థియేట‌ర్‌లో సినిమాను ప్ర‌ద‌ర్శించిన వైనం
  • సౌండ్ సిస్ట‌మ్ సరిగా లేద‌ని ప‌వ‌న్ అభిమానుల రాళ్ల దాడి
pawan kalyan fans attacked on sri rama talkies in kurnool

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు గురువారం క‌ర్నూలులోని శ్రీరామ టాకీస్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ అద్దాలు ధ్వంస‌మయ్యాయి. ఈ ఘ‌ట‌న‌తో థియేట‌ర్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శుక్ర‌వారం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఓ రోజు ముందుగానే ఆయ‌న న‌టించిన పాత చిత్రం జ‌ల్సాను మ‌రోమారు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా శ్రీరామ థియేట‌ర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున త‌ర‌లివచ్చారు. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా థియేట‌ర్‌లో సౌండ్ సిస్ట‌మ్ స‌రిగా లేద‌ని ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫ్యాన్స్ రాళ్ల‌తో థియేట‌ర్‌పైకి దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ పాక్షికంగా ధ్వంస‌మైంది.

More Telugu News